అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.
ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.
శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం –దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.
ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.
అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది. బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:
సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః
ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు. ఆ పూరణలేమిటంటే:
దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే. ఇక వ్యాఖ్యాన పటిమని పరీక్షించాలి. ఇందుకోసం అంబికాదత్తుడు, రఘువంశంలోంచి ఒక శ్లోకము, కావ్య ప్రకాశమనే గ్రంథంలోంచి మరొక శ్లోకము ఇచ్చి – వీటిపై గణపతిని వ్యాఖ్యానించమన్నాడు. అనర్గళంగా, సుమారుగా ఒక గంటసేపు, ఈ రెండు శ్లోకాలపై తన కవిత్వ పటుత్వాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, యుక్తిని, విమర్శనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ, సభాసదులందర్నీ మంత్రముగ్ధులని కావిస్తూ గణపతి ప్రసంగం కొనసాగుతోంది – ఇంతలో, ఒకచోట – సర్వాసాం అనుటకు బదులు సర్వేషాం అని గణపతి వాణి తొట్రుబడింది. తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న అంబికా దత్తుడు – వెంటనే ‘విరామాతావత్‘ అన హూంకరించి:
నిర్దుష్టమగు పద్యములో మనోహరమగు వచనమందు నీ వాణి స్ఖలించెను. నీవు త్రిభువన శ్రేష్టురాలగు సరస్వతినారాధించలేదా? అంటూ ఆక్షేపించాడు. స్త్రీలింగ శబ్దం వాడాల్సిన చోట పుల్లింగం వాడేడని ఇందులో చమత్కారం.సుమారొక గంటసేపు గంగాప్రవాహంలా పరవళ్ళు తొక్కుతూ, రసికజన హృదయాలని రసపూరితమొనర్చిన వాణి, అంత సేపు నిర్దోషంగా ఉన్నందుకు అభినందించడానికి పోయి, ఆక్షేపించిన అంబికాదత్తుడు కూడా పాపం పప్పులో కాలేసాడు. సారస్తారా అని పుల్లింగ శబ్దాన్ని ప్రయోగించడానికి బదులు,సారాతారా అంటూ ప్రాసకోసం పాకులాడేడు. గణపతి వెంటనే ఈ దోషాన్ని సభాసదులకెత్తి చూపి:
అంబి:
(ఓ దీపమా, నీవు గృహములోపలనే ప్రకాశించగలవు, వెలుపలకు వచ్చినచో గాలిచే కదల్పబడుదువు – అనగా సభలలో నీ పాండిత్యము నిలువ జాలదని పరిహాసం)అంబికాదత్తుడు:
(ఓ కుంజరమా, మదముచే గర్వించి బృంహిత ధ్వనులను చేయుచుంటివి. ఏనుగుల కుంభస్థలములందుండు మాంసమును హరించు సింహమిచ్చటనే కలదు సుమా)
గణపతి:
మరల దోషమే. కర్మధారయ సమాసముపై హరీ యను మత్వర్ధీయము చెల్లదు. కుంభికుంభామిషాహారః అని బహువ్రీహి సమాసమును మాని ప్రాసకొరకే పాకులాడుతూ దోష ప్రదర్శన చేసుకొనుచున్నావు.
మరల దోషమే. కర్మధారయ సమాసముపై హరీ యను మత్వర్ధీయము చెల్లదు. కుంభికుంభామిషాహారః అని బహువ్రీహి సమాసమును మాని ప్రాసకొరకే పాకులాడుతూ దోష ప్రదర్శన చేసుకొనుచున్నావు.
గణపతికి అంబికాదత్తుడెవరో, అతని వ్యక్తిగత జీవితమేమిటో అస్సలు తెలియదు. కాని, అంబికాదత్తుడి మొదటి భార్య సరోజిని చనిపోగా, అతను రెండో పెళ్ళి చేసుకొన్నాడు, కాని ఆవిడ అప్పటికింకా పుష్పవతి కానందువల్ల, సంసార సుఖానికి నోచుకోలేదు. ఈ విషయం, తెలియకుండానే ధ్వనింప చేసిన గణపతి సిద్ధకవి అని గ్రహించి, అంబికాదత్తుడు, వాదం చాలించి, గణపతిని ఒక ఆసనముపై కూర్చుండబెట్టి, మొహం చిన్నపుచ్చుకొని మౌనంగా ఉండిపోయాట్ట. ఇది కనిపెట్టిన శితికంఠ వాచస్పతి – మీరిద్దరూ సంసారవిషయములను, వ్యక్తిగత దూషణలను విడిచిపెట్టి, గౌడ దాక్షిణాత్యులగుటచే, పరస్పరాంతర్జాతి పరముగా పరిహసించుకొని, సాహిత్య వృత్తాంతములచే వాదముపసంహరించండి అని ఇద్దరినీ ఆజ్ఞాపించాడు.
వెంటనే – అంబికాదత్తుడు:
గణపతి:
అప్పుడు మిగిలిన పరీక్షావర్గం వారు, గణపతినింకా పరీక్షించగోరి, భారతమందు పదునెనిమిది పర్వముల సారమునూ పర్వమునొక్కొక్క శ్లోకము చొప్పున 18 శ్లోకములను చే, అపి, హి, తు, చ అను పదములను ప్రయోగించకుండా చెప్పమని అడిగారు. అడిగిన వెంటనే, ఆశువుగా గణపతి పదునెనిమిది శ్లోకములతో భారతకథా సారమంతా మనోహరంగా చెప్పి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేడు.
నవద్వీపచరిత్రలో ఒక ఆంధ్రుడు గెలుపొందడం ఆకాలంలో అదే మొదటిసారి. పరీక్షావర్గం గణపతికి ‘కావ్యకంఠ’ అనే బిరుదుతో పాటుగా ఒక శ్లోకం బహుమానంగా ఇచ్చి సత్కరించారు.
సద్దర్శనం, రమణగీత, ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమా శతకం, దశమహావిద్యలు వంటి వేదాంత, తాంత్రిక గ్రంధాలు, విశ్వమీమాంస, తత్వఘంటాశతకం, భారత చరిత్ర పరీక్ష వంటి విమర్శనాత్మక గ్రంథాలు, అంబికాగీతం, యోగసార గీతం, గురుగీతం, రేణుకాగీతం, గణపతిగీతం వంటి స్తోత్ర సాహిత్యం, సంస్కృతంలో పూర్ణ అనే ఆంధ్రవిష్ణువుకాలం నాటి చారిత్రాత్మక నవల ఇలా గణపతిముని సాహిత్య సృష్టి అపారం. అంతే కాకుండా, గణపతిముని భారతదేశ స్వాతంత్రపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు, అస్పృశ్యతా నివారణోద్యమాల్లో కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
బొబ్బిలి దగ్గర కలవరాయి అనే అగ్రహారంలో 1878 సంవత్సరం కార్తీక బహుళ అష్టమి నాడు జన్మించిన గణపతిముని 58 సంవత్సరాలు మాత్రమే జీవించి, 1936 లో ఖరగ్పూరులో పరమపదించారు.
———-
No comments:
Post a Comment