Pages

Monday 27 May 2013

మంత్రం గురించి మరింత వివరణ


“పరివర్తనను సృష్టించే”( స్ప్రిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ [ఆధ్యాత్మిక పరివర్తన])సమర్థతగలదిగా పరిగణించే ధ్వని, అక్షరం,పదం లేదా పదసమూహాన్ని మంత్రం అంటారు. మంత్రంతో సంబంధం ఉన్న సంప్రదాయం, వేదాంతాల ప్రకారం వాటి వాడుక విధాలలో మార్పులు ఉంటాయి.

భారతదేశ వేద సంప్రదాయంలో ఆవిర్భవించిన మంత్రాలు (దేవనాగరీ), తర్వాత హిందూ సంప్రదాయంలో ప్రధాన భాగంగా బౌద్ధిక మతం, సిక్కు మతం ఇంకా జైన మతంలో ప్రచలిత ఆచారాలుగా మారాయి. ప్రాచీన తూర్పు దేశ సంప్రదాయాలు మతాలలోని ఆచారాలపై ఆధారిత లేదా శాఖలైన మంత్రాల వాడుక ఇప్పుడు అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలలో వ్యాపించాయి.

ఓం అక్షరం వేదాంత గూఢత్వంలో మంత్రంగా భావిచబడుతుంది.

వేదాల సందర్భంలో మంత్రం అనే పదం బ్రాహ్మణుల వ్యాఖ్యానమైన గద్య భాగానికి విరుద్ధంగా పద్య భాగమైన రిగ్,యజుర్ లేదా సామ అనబడే పాఠాలు గల సంపూర్ణ భాగానికి సంబంధించినది. అనుష్ఠాత్మక వేద సంప్రదాయం నుండియోగా, వేదాంతం, తంత్రం, భక్తి మొదలగు వాటి మార్మిక మరియు సర్వమానవ సమత్వాన్ని కోరే హిందూ సంప్రదాయలలోకి పరివర్తనం చెందడంతో, మంత్ర పరిజ్ఞాన విశిష్ట స్వభావానికి చెందిన పూర్వాచార పరాయణమైన వైఖరి, మంత్రాల ఆధ్యాత్మిక వివరణలను మానవ సంకల్పం లేదా కోరికను కొన్ని సామాన్య లక్షణాలూ ఇంకాఉచ్చారణలతో కూడిన ఒక కార్య రూపానికి అనువాదాలుగా మార్చాయి.

ఉపనిషత్తులలో పవిత్ర హిందూ గ్రంథాల రచయితలు ఓం అక్షరంలోనే మంత్రం ఉందని భావిస్తారు. ఈ ఓం అక్షరంబ్రాహ్మణులు, భగవంతుడు, సంపూర్ణ సృష్టిని సూచిస్తుంది. ధ్వనులు అన్నీ ధర్మకాయ బుద్ధుడి స్వరం అని కుకై సూచిస్తాడు, అనగా హిందూ ఉపనిషత్తు మరియు యోగాత్మక చింతనలో ఉన్నట్లుగా మంత్రాలను ఉచ్చరించే వ్యక్తి గ్రహణశక్తికి అతీతంగా మంత్రాల ధ్వనులకు సహజసిద్ధ అర్థం ఉందని సూచిస్తూ ధ్వని ప్రతీకాత్మకత అర్థంలో ఈ ధ్వనులు తుది సత్య వ్యక్తీకరణలని తెలపబడింది.

అయితే, ఈ మంత్రాలు దేనికి ప్రతీకలుగా నిలుస్తాయో లేదా అవి ఎలా పనిచేస్తాయో అనే విషయాల అర్థబోధన భిన్న భిన్న సంప్రదాయలలో వేరువేరుగా ఉంటాయి. ఈ భేదానికి కారణం అవి రాసిన లేదా ఉచ్చరించిన సందర్భాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రతి ధ్వనికి సంబంధించిన ప్రతీకత్మకతలో బహు స్తరాలు ఉన్నాయి. వాటిలో చాలామటుకు ప్రత్యేక చింతన సంప్రదాయాలకు నిర్దిష్టమైనవే. అలాంటి సందర్భాల ఉదాహరణలకు, హిందూ మతం బౌద్ధ మతాల సంప్రదాయాలకు కేంద్రమైన ఓం అక్షరాన్ని చూడండి.

చివరకు హిందు తంత్ర శాస్త్రంలో వర్ణాలనూ ధ్వనులనూ పవిత్రత సాదృశ్యాలుగా పరిగణించబడ్డవి, అయితే రాయడంలోకి పరివర్తన మాత్రం బౌద్ధ మతం చైనా దేశానికి వ్యాపించిన తర్వాత జరిగింది. చైనా దేశంలో సంస్కృతం వంటి ఏకీకరించే దివ్య భాష లేకపోయినా చైనా దేశం తమ సంస్కృతి ఏకత్వాన్ని, ఉచ్చారణలో సరళంగా ఉన్న అర్థపరంగా ఎంతో కచ్చితంగా ఉండే చిహ్నాలుగల లిఖిత భాష ద్వార సాధించింది. భారత దేశ బౌద్ధమత ధర్మప్రచార సంస్థల కంటే చైనా దేశీయులు లిఖిత భాషకు పెద్ద పీఠ వేశారు. ఈ విధంగా మంత్రాలు రాయడం అప్రయత్నంగానే ఒక ఆధ్యాత్మిక ఆచారంగా మారింది. బ్రాహ్మణులు సరైన ఉచ్చారణ విషయమై ఖచ్చితంగా వ్యవహరించే వారు కాని చైనా దేశీయులు ఇంకా ఇతర దూరప్రాచ్య దేశాలు బౌద్ధ మతస్థులు దీనిని అంతగా పట్టించుకోకుండా సరిగా రాయడంపై తమ దృష్టి సారించారు. మంత్రాలను రాసే అభ్యాసం అలాగే ఆధ్యాత్మిక ఆచరణగా పాఠాలను నకలు చేయడం జపానులో చాలా సంస్కరించబడ్డది. అంతే కాకుండా ఎన్నో బౌద్ధమత సూత్రాల సంస్కృతం గల సిద్ధం లిపిలో రాయడం ఇటీవల కలంలో కేవలం జపానులోనే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా, ఎన్నో లిపులలో రాసిన హిందూమత ఆచార సంస్కృత మంత్ర-పునరావృత్తులు భారత దేశంలో కూడా చాలా మతభేదాలలో పేరుగాంచినది.

ఖన్నా (2003: పు. 21)మంత్ర యంత్రాలను చింతన రూపాలకు సంబంధం తెలుపుతుంది.


యంత్రాలపైన లిఖించిన సంస్కృత అక్షరాలైన మంత్రాలు, నిజానికి ధ్వని-స్పందనలతో ప్రభావం చూపే దివ్య శక్తులు లేదా విశ్వ శక్తులకు సాదృశ్యాలైన ‘చింతన రూపాలు.’


వికీ పిడియా లోని విస్తృతమైన వివరణలను ఇక్కడనుండి చూడండి.

No comments:

Post a Comment